జమ్మూ–కాశ్మీర్: హిందూ భక్తుల కోసం అత్యంత పవిత్రమైన అమరనాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు హిమాలయాల నడుమ 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమరనాథ్ గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ యాత్రను చేపడతారు. అధికారిక సమాచార ప్రకారం, ఈ ఏడాది అమరనాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభమై ఆగస్టు 9తో ముగియనుంది. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు అమరనాథ్ శ్రైన్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న గుర్తించిన బ్యాంకు శాఖల్లో తగిన రుసుము చెల్లించి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
అమరనాథ్ గుహ స్థానం
ఎత్తు: సముద్ర మట్టానికి 3,800+ మీటర్లు
జమ్మూ నగరానికి దూరం: 178 కిలోమీటర్లు
దేశం నలుమూలల నుంచి రైలు లేదా బస్సు ద్వారా జమ్మూకు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి బల్తాల్ (373 కిమీ) లేదా పహల్గామ్ (260 కిమీ) మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని ముందుకు ప్రయాణించాలి.
యాత్ర మార్గాలు & ట్రెక్కింగ్
బల్తాల్ మార్గం:
1–2 రోజుల ట్రెక్కింగ్, తొందరగా చేరాలనుకునే వారికి అనుకూలం
పహల్గామ్ మార్గం:
36–48 కిమీ ట్ర trekk. 3–5 రోజుల సమయం పడుతుంది. సాంప్రదాయ మార్గంగా పరిగణించబడుతుంది
అమరనాథ్ గుహ రహస్యాలు
శతాబ్దాలు గడిచినా, అమరనాథ్ గుహలో మంచుతో సహజంగా ఏర్పడే శివలింగం గురించి అనేక రహస్యాలు ఇప్పటికీ తెలియనివిగానే ఉన్నాయి. ఆధునిక సాంకేతికత పెరిగినా కూడా ఈ సహజ అద్భుతం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను పూర్తిగా అర్థం చేసుకోవడం ఇప్పటికీ సాధ్యపడలేదు.