kntv
kntv

తిరుమల శ్రీవారి సేవలో హీరో సాయి ధరమ్ తేజ్

1 hour ago

ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.