SEARCH

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    cp sajjanar : సైబర్ నేరాల నివారణకు చార్మినార్ వద్ద అవగాహన కార్యక్రమాలు ప్రారంభించిన హైదరాబాద్‌ సీపీ సజ్జనార్

    1 day ago

    హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. చారిత్రాత్మక చార్మినార్ వద్ద శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సైబర్ క్రైమ్‌ మోసాల గురించి ప్రజలకు తెలియజేశారు.

    ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ—

    ప్రతి శనివారం, మంగళవారం చార్మినార్ వద్ద గడపగడపకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సైబర్ మోసాలకు గురవుతున్నారని, ప్రతి రోజు హైదరాబాద్‌లోనే సుమారు కోటిరూపాయలు కోల్పోతున్నారని వివరించారు. ముఖ్యంగా ఓటీపీ ఇన్వెస్ట్‌మెంట్లు, డిజిటల్ అరెస్ట్, ఫోన్ బెదిరింపులు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

    అలాగే ప్రజలకు కీలక సూచనలు చేశారు:

    సైబర్ నేరగాళ్లు కాల్ చేసి భయపెట్టినా భయపడకూడదని, భయం నేరస్తులకు బలం అవుతుందని హెచ్చరించారు. ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయరాదని, అలా చేస్తే ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘సైబర్ సింబా’ పేరిట వాలంటరీ వ్యవస్థను ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పౌరుల్లో సైబర్ అవగాహన పెంచి, నగరాన్ని సైబర్ మోసాల నుండి రక్షించడమే లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.

    Click here to Read More
    Previous Article
    Ananya Nagalla: అనన్య నాగళ్ల ప్రత్యేక ఫోటో గ్యాలరీ
    Next Article
    andrea jeremiah : పెద్ద రిస్క్ తీసుకున్న ఆండ్రియా: ‘మాస్క్’ కోసం ఇంటిపై రుణం!

    Related తెలంగాణ Updates:

    Comments (0)

      Leave a Comment