kntv
kntv

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్...

1 month ago

వీరులపాడు మండలం వి. అన్నవరం గ్రామంలో ప్రజా దర్బార్లో తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు గ్రామాలకు వచ్చి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.