Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Ts CM Revanth Meets PM Modi : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి – ప్రధాని మోదీకి తెలంగాణ రైజింగ్–2047 సమ్మిట్ ఆహ్వానం

    55 minutes ago

    తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటిస్తూ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చించారు. పార్లమెంట్ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని మోదీని అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ – 2047 గ్లోబల్ సమ్మిట్” కు రావాల్సిందిగా సీఎం ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సమ్మిట్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి సమర్పించారు.

     

    తమ ప్రభుత్వ దూరదర్శి ప్రణాళికలను వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి, వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధానికి తెలియజేశారు. అన్ని రంగాల వృద్ధి వ్యూహాలు, భవిష్యత్ దిశానిర్దేశంతో కూడిన “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్” ను సిద్ధం చేశామని తెలిపారు. నీతి అయోగ్ సూచనలు, వివిధ రంగాల నిపుణుల సిఫారసులతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి వివరించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ సమ్మిట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.

    Click here to Read More
    Previous Article
    Ap Dcm Pawan Kalyan : గ్రామస్థాయిలోనే ఆవిష్కరణలు వెలుగులోకి రావాలి – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

    Related తెలంగాణ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment