Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Parakamani Case : తిరుమల పరకామణి దొంగతనం కేసులో కీలక పురోగతి – సిట్ నివేదిక హైకోర్టులో

    8 hours ago

    తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తమ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. సిట్‌కు నేతృత్వం వహించిన సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్ ఈ నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. కేసుపై తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారం చేపట్టనుంది.

     

    చోరీ కేసు నుండి లోక్ అదాలత్ వరకూ…

    2023 ఏప్రిల్‌లో టీటీడీ ఉద్యోగి రవికుమార్, తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత, అనూహ్యంగా ఈ కేసు లోక్ అదాలత్‌కు బదిలీ కావడం సంచలనంగా మారింది. నిందితుడు రవికుమార్, తనకు చెందిన రూ.40 కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వడంతో, 2023 సెప్టెంబర్‌లో ఈ కేసు రాజీ ఫార్ములాతో ముగిసిపోయింది.

    చిన్న దొంగతనం కేసుకు ఇలా భారీ స్థాయి ఆస్తులను విరాళంగా ఇచ్చి కేసును ముగించడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించడాన్ని సవాలు చేస్తూ, పూర్తి స్థాయి విచారణ చేయాలని హైకోర్టును కోరారు.

     

    హైకోర్టు ఆదేశాలతో ప్రారంభమైన సిట్ విచారణ

    హైకోర్టు ఆదేశాల మేరకు ప్రారంభమైన సిట్ విచారణలో, అప్పటి టీటీడీ ఛైర్మన్ బి. కరుణాకర్ రెడ్డి, లోక్ అదాలత్ పరిష్కారం జరిగిన సమయంలో ఛైర్మన్‌గా ఉన్న వై.వి. సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి పలువురు టీటీడీ, పోలీసు అధికారులను ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసిన అనంతరం, నివేదికను హైకోర్టుకు అందజేశారు.

     

    ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టుపైనే

    ఇప్పుడు సిట్ సూచనలు, పరిశీలనలు ఏం ఉన్నాయనేది హైకోర్టులో నివేదిక తెరుచుకున్న తర్వాతే వెల్లడికానుంది. ఈ కేసులో ఉన్న అనేక అనుమానాలపై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.   హైకోర్టు శుక్రవారం జరిగే విచారణ ఈ కేసులో తదుపరి దిశను నిర్ణయించే అవకాశాలున్నాయి.

    Click here to Read More
    Previous Article
    Dulquer Salmaan’s shocking comments : బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దుల్కర్ సల్మాన్
    Next Article
    Ap Dcm Pawan Kalyan : గ్రామస్థాయిలోనే ఆవిష్కరణలు వెలుగులోకి రావాలి – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

    Related ఆంధ్రప్రదేశ్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment