Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Ap Dcm Pawan Kalyan : గ్రామస్థాయిలోనే ఆవిష్కరణలు వెలుగులోకి రావాలి – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

    14 hours ago

     

    సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు, భద్రత, ప్రోత్సాహం కల్పించడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ–శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో శాస్త్ర, సాంకేతిక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆవిష్కరణలను గుర్తించి, పేటెంట్ హక్కులు కల్పించడం ద్వారా కొత్తతరం ఆవిష్కర్తలకు మార్గం సుగమం చేస్తామని పేర్కొన్నారు.

     

    “విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే పునాది”

    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక శక్తి అన్నారు.
    “కొత్త ఆలోచనలను గుర్తించి, వాటిని మార్కెట్‌ వరకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహకారం అందించాలి. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వాలి. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఉన్న ప్రతిభను వెలికితీయాలి,” అని పేర్కొన్నారు.

    ఆవిష్కరణలు గుర్తింపు పొందిన వెంటనే పేటెంట్ రక్షణ కల్పించాలని సూచించారు. ఇప్పటివరకు అవార్డులు ఇచ్చే స్థాయిలోనే కార్యక్రమాలు నిలిచిపోయాయని, ఇకపై వాటిని పరిశ్రమలతో అనుసంధానం చేసి మార్కెట్‌ దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

     

    “మేడిన్ ఇండియా – మేకిన్ ఇండియాలో మన వంతు పాత్ర అనివార్యం”

    పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా ఉద్యమానికి రాష్ట్రం నుంచి పెద్దఎత్తున సహకారం అందించడానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు.
    “దిగుమతులపై ఆధారపడటం తగ్గితేనే దేశ ఆర్థిక బలం పెరుగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలిపే లక్ష్యంతో ముందుకు సాగాలి,” అని చెప్పారు.

     

    ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఆవిష్కర్తలకు ప్రాధాన్యం

    నూతన ఆవిష్కర్తలను మార్కెట్‌కు పరిచయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
    “అవసరమైతే ఎంఎస్ఎంఈ పార్కుల్లో వీరికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారితో చర్చిస్తాం,” అని తెలిపారు.

     

    ప్రతిభ గ్రామాల్లోనే ఉంది – గుర్తించడం ప్రభుత్వ బాధ్యత

    గ్రామాల్లో ప్రజల అవసరాలకు తగిన ఆలోచనలు వెలువడే అవకాశం ఎక్కువుందని ఉదాహరణలతో వివరించారు.

    • నల్లమల చెంచు యువకుడు “శివ” యురేనియం తవ్వకాల ప్రమాదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు,

    • తీరప్రాంత మత్స్యకార యువతలో ఉన్న నైపుణ్యాన్ని సాంకేతికతతో మిళితం చేస్తే కీలక ఆవిష్కరణలు వెలువడతాయని చెప్పారు.

    “ఆవిష్కరణలకు విద్యార్హత కొలమానం కాదు. గ్రామం, నగరం, వయస్సు అన్న తేడా లేకుండా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలి. నూతన సంవత్సరం నూతన ఆవిష్కరణల సంవత్సరం కావాలి,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

     

    సమీక్షలో పాల్గొన్న అధికారులు

    ఈ సమావేశంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, మెంబర్ సెక్రటరీ శరవణన్, ఆప్‌కాస్ట్ సీఈఓ డాక్టర్ కె. శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    Click here to Read More
    Previous Article
    Parakamani Case : తిరుమల పరకామణి దొంగతనం కేసులో కీలక పురోగతి – సిట్ నివేదిక హైకోర్టులో

    Related ఆంధ్రప్రదేశ్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment