Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Minister Nara Lokesh Fires on YCP Fake Posts In Social Media : పింఛన్‌లపై వైకాపా దుష్ప్రచారం: 63 లక్షల మందికి రూ.2,739 కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం

    10 hours ago

    ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల జారీపై వైకాపా తన సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నదని టిడిపి వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రతి నెల వేల సంఖ్యలో పెన్షన్లలో కోతలు విధిస్తున్నట్లు వైకాపా ఆరోపణలు చేస్తుండగా, వాస్తవానికి ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8 వేల మందికి పింఛన్లు మంజూరు చేసింది.

     

    “జగన్ రెడ్డి చేసిన ప్రచారం కల్పితం” — టిడిపి విమర్శ

    టిడిపి వర్గాల ప్రకారం, జగన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రజల జీవితాలతో ఆటలు ఆడిన వైకాపా నేతలు, ఇప్పుడు కూడా తప్పుడు ఆరోపణలకు తెరదిస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ ఓట్లతో వైకాపా పాలనను తిరస్కరించినా కూడా, వారు తమ “వక్రబుద్ధి”ని ఆపడం లేదని టిడిపి ఆరోపించింది.

     

    కూటమి ప్రభుత్వం సెవలో రూ.50,763 కోట్ల పింఛన్లు

    కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాదిన్నర కాలంలో రూ.50,763 కోట్లు సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఖర్చు చేసినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దేశంలో సంవత్సరానికి రూ.33,000 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని కూడా పేర్కొన్నారు.

     

    డిసెంబర్ నెలలోనే 63.25 లక్షల మందికి పింఛన్లు పంపిణీ

    డిసెంబర్ నెలలో మొత్తం 63,25,999 మంది లబ్దిదారులకు రూ.2,739 కోట్లు పెన్షన్ల రూపంలో అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. అదనంగా, గత రెండు నెలలుగా పింఛన్ పొందని 1,39,677 మందికి రూ.114 కోట్లు, ముగ్గురు నెలలుగా పొందని 13,325 మందికి రూ.16 కోట్లు కూడా విడుదల చేశారు.

    “జగన్ హయాంలో ఇలాంటిదేమీ జరగలేదు” — టిడిపి వ్యాఖ్య

    జగన్ రెడ్డి పాలనలో ఒక్క నెల పింఛన్ తీసుకోకపోతేనే లబ్ధిదారులను తొలగించేవారని టిడిపి విమర్శించింది. “తూచ్… మీ పెన్షన్ మేమే తింటాం” అనే ధోరణితో ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించింది. ప్రస్తుతం ప్రభుత్వం నిబద్ధతతో పింఛన్లను పంపిణీ చేస్తోంది మరియు ఎవరికీ అన్యాయం జరగకుండా పనిచేస్తున్నామని స్పష్టంచేసింది.  

    సోషల్ మీడియాలో వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలి: టిడిపి పిలుపు

    వైకాపా సోషల్ మీడియా వేదికల్లో చేస్తున్న అసత్య ప్రాచారాన్ని ప్రజలు నమ్మడం లేదని, దీనిని క్షేత్రస్థాయిలో ఖండించాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చింది. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని టిడిపి నాయకులు ప్రకటించారు.

     

    Click here to Read More
    Previous Article
    lord vishnu matsya avatar : మత్స్యద్వాదశి – వేదాలను రక్షించిన విష్ణుమూర్తి తొలి అవతార దినం
    Next Article
    Ts cm Revanthreddy రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలకు నారాయణపేటలో సీఎం శ్రీకారం – అభివృద్ధికి బలమైన హామీ

    Related ఆంధ్రప్రదేశ్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment