శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ICC : భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై ఐసీసీ కఠిన వైఖరి.. పీసీబీ డిమాండ్లపై స్పష్టత లేని పరిస్థితి

    1 రోజు క్రితం

    లాహోర్:

    భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ వైఖరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠినంగా స్పందించినట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్–2026 నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు లాహోర్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, పాకిస్తాన్‌కు ఆదాయం పెంపు, భవిష్యత్తులో ‘నో హ్యాండ్‌షేక్’ వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే మూడు ప్రధాన డిమాండ్లను పీసీబీ ముందుంచింది.

    అదే సమయంలో బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించినప్పటికీ వారికి ఆర్థిక పరిహారం ఇవ్వాలని పీసీబీ కోరగా, ఐసీసీ మాత్రం పరిహారం ఉండదని, అయితే ఐసీసీ ఆదాయంలో వారికి పూర్తి వాటా అందేలా చూస్తామని స్పష్టం చేసింది. ఐసీసీ నిర్ణయాలపై బీసీసీఐ ప్రభావం ఎక్కువగా ఉందంటూ పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఈ వివాదం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపవచ్చని ఐసీసీ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    KL Rahul's century sinks 42-time champions Mumbai, Karnataka enter Ranji S-F
    తర్వాత ఆర్టికల్
    Gilbert Hill: Mumbai’s 66-million-year-old dinosaur-era volcano hidden in plain sight

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి