kntv
kntv

తిరుమలలో భక్తుల రద్దీ. దర్శనానికి 18 గంటల నిరీక్షణ!

1 hour ago

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం ఒక్కరోజే 75,485 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు నమోదైంది. అలాగే 3.70 లక్షల లడ్డూలు విక్రయించగా, దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు.