kntv
kntv

ముద్రగడ త్వరగా కోలుకోవాలని మహా మృత్యుంజయ హోమం

2 hours ago

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని అమలాపురం గౌతమి ఘాట్ అయ్యప్పస్వామి ఆలయంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. జక్కంపూడి రాజా ప్రత్యేక పూజల్లో పాల్గొని, ముద్రగడ ఆరోగ్యం గత మూడు రోజులుగా మెరుగుపడిందని, వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని ఆకాంక్షించారు.