kntv
kntv

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జనసేన వినతి

3 hours ago

కాకినాడకు చెందిన జనసేన 10వ డివిజన్ ఇన్‌ఛార్జ్ మోసా యేసేబు మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలో జనసేన, టీడీపీ రాష్ట్ర కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. కుంభాభిషేకం రేవు ఆధునికీకరణ, దమ్ములపేట వంతెన నిర్మాణంతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొంటూ ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.