kntv
kntv

బీబీ కా ఆలం ఊరేగింపు విజయవంతం.. సజ్జనార్ కృతజ్ఞతలు

1 hour ago

హైదరాబాద్‌లో చారిత్రక బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసిందని సజ్జనార్ తెలిపారు. చార్మినార్ వద్ద భద్రతను పర్యవేక్షించి పవిత్ర ఆలంకు దట్టీ సమర్పించారు. 2,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, డ్రోన్లు, హార్స్ రైడింగ్ బృందాలతో బందోబస్తు నిర్వహించారు. సహకరించిన షియా కమ్యూనిటీ, మత పెద్దలు, ప్రభుత్వ శాఖలు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.