సినీ నటి రష్మిక మందన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్ సృష్టించడం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇటువంటి చర్యలు సమాజంలో కొందరి నైతిక పతనాన్ని సూచిస్తున్నట్లు తెలిపారు. ఏఐ సాంకేతికతపై రష్మిక మాట్లాడుతూ, "నిజాన్ని కూడా సృష్టించగలిగే ఈ కాలంలో, వివేచన మనకు గొప్ప రక్షణ. ఏఐ అభివృద్ధికి దోహదపడే శక్తి, కానీ దానిని మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యతను సృష్టించడానికి వాడటం లోతైన నైతిక పతనాన్ని చూపిస్తుంది" అన్నారు.
"ఇంటర్నెట్ వాస్తవానికి అద్దం పట్టదు, అది ఏదైనా సృష్టించగల ఒక కాన్వాస్గా మారింది. ఈ దుర్వినియోగాన్ని అధిగమించాలి. గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ఏఐని ఉపయోగించుకోవాలి. బాధ్యతగా మెలగడం నేర్చుకోవాలి. మనుషుల్లా ప్రవర్తించని వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి." ఇటీవల కాలంలో ఏఐ డీప్ఫేక్ల బారిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.