kntv
kntv

రూ.899 కోట్ల హ్వాసంగ్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

1 hour ago

రాయలసీమ అభివృద్ధికి మరో భారీ పెట్టుబడి లభించింది. రూ.899 కోట్ల పెట్టుబడితో దక్షిణ కొరియాకు చెందిన హ్వాసంగ్ గ్రూప్ (ఆడిడాస్ తయారీ భాగస్వామి) ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ షూ తయారీ ప్లాంట్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 17,645 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.