కోల్కతా/గువాహటి:
కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో గిల్ మూడు బంతులే ఆడినప్పటి తరువాత, రెండో ఇన్నింగ్స్లో గాయం తీవ్రతరం కావడంతో ఆ తర్వాత బ్యాటింగ్కు రాలేదు. శుక్రవారం గిల్ ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యారు, అయితే ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జట్టు గిల్ను జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో గిల్ ముంబైకు వెళ్లి కొన్ని రోజుల విశ్రాంతి తీసుకొని, తర్వాత వైద్యులను సంప్రదించనున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతడిని పంపే అంశంపై ఏ నిర్ణయం తీసుకోలేదు.
రిషభ్ పంత్ కెప్టెన్సీ ఫీట్
నవంబర్ 22 (శనివారం) నుంచి గువాహటి వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో, గిల్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యతలు స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీసుకున్నారు.
పంత్ వికెట్ కీపర్ కెప్టెన్గా మ్యాచ్ ఆడే రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ ఫీట్ ఇప్పటి వరకు సాధించిన తొలి వ్యక్తి క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ. ధోనీ తర్వాత ఈ రికార్డును సాధించే భారత కెప్టెన్గా పంత్ నిలవనున్నారు. ఈ నిర్ణయం టీమిండియాకు కొత్త అవకాశం, అలాగే పంత్ కెప్టెన్సీ పరిధిలో అనూహ్య రికార్డును అందించే అవకాశం కలిగిస్తోంది.