ఫిబ్రవరి 13న తెలంగాణ పర్యటనకు రానున్నా ప్రధాని మోదీ
ఫిబ్రవరి 13న హైదరాబాద్కు రానున్నా మోదీ . సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. బీజేపీ నేతలు, తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడటం, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో మోదీ తెలంగాణ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న క్రమంలో.. జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా విమర్శలు చేస్తారా.? కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసే ఆరోపణలకు సమాధానం చెబుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్పై మోదీ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నిక ల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారంటూ మోదీ అనేకసార్లు ప్రశంసించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను కూడా మోదీ పొగిడారు. గతంలో బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగిన సమయం లో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.