రెండో వన్డేలో విజృంభించిన భారత బౌలర్లు

న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యంప్రదర్శించడం తో 34.3 ఓవర్లకు.. 108 పరుగులకే న్యూజిలాండ్‌ ఆలౌట్‌ అయింది. కివీస్‌ బ్యాటర్లలో 36రన్స్‌తో ఫిలిప్స్‌ టాప్‌స్కోరర్‌గా ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్‌ (27) పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ టాపార్డర్‌.. ఫిన్‌ అలెన్‌ (0), డెవాన్‌ కాన్వే (7), హెన్రీ నికోల్స్‌ (2), డారిల్ మిచెల్ (1), టామ్‌ లేథమ్‌ (1) మాత్రమే చేశారు 15 పరుగులకే పెవిలియన్‌ కు చేరారు. మొత్తం 8మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజీలాండ్‌ స్కోర్‌ 15 పరుగులు మాత్రమే. ఏకంగా సగం టీమ్‌ పెవిలియన్‌కు వెళ్లిపోవడంతో.. న్యూజిలాండ్‌ 108 పరుగులు కూడా అతి కష్టం మీద చేయగలిగింది.