పెద్దాపురం డి.ఎస్.పి ఎస్ మురళీమోహన్ పర్యవేక్షణలో 32 కేజీల గంజాయి మూటలు స్వాధీనం

గంజాయి కేసులో 9 మంది అరెస్ట్ కాకినాడ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్రబాబు ఆదేశాల మేరకు పత్తిపాడు  సిఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఓ గంజాయి ముఠా ను గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు కాకినాడ అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ సూచనల మేరకు పెద్దాపురం డి.ఎస్.పి ఎస్ మురళీమోహన్ పర్యవేక్షణలో ముగ్గురు ఎస్సైలు సిబ్బంది పథకం ప్రకారం గంజాయి ముఠాపై మండపం సెంటర్ గోపాలపట్నం గ్రామాల్లో దాడి చేసి 32 కేజీల గంజాయి విలువ లక్ష12 వేలు 10 డమ్మీ గంజాయి రంపపొట్టుతో కూడిన మూటలు స్వాధీనం తోపాటు రెండు మోటార్ సైకిల్ ఆర్ సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకుని సీజ్ చేసినట్లు  డిఎస్పి వివరించారు అన్నవరం స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో డిఎస్పి వివరాలను వివరిస్తూ మొత్తం ఈ కేసులో 11 మంది ముద్దాయిలు కాగా 9 మంది ముద్దాయిలను చాక చక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు రౌతులపూడి మండలం ఎస్ పైడిపాలెం గ్రామానికి చెందిన కాళ్ల శివ జమీల్ రాజవొమ్మంగి మండలం ఒట్టిగడ్డ గ్రామం నాయుడు లు పరారీ లో ఉన్నారని వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ప్రతిపాడు అన్నవరం ఏలేశ్వరం ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *